మామకు నివాళులర్పించిన సీఎం జగన్..

దిశ, ఏపీబ్యూరో : ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి పార్థివ దేహానికి సీఎం జగన్ ​నివాళులు అర్పించారు. జగన్‌కు ఆయన స్వయాన మామగారు. ​వైఎస్ భారతి తండ్రి. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. దీంతో జగన్​ ఇవాళ కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్​ ద్వారా పులివెందులకు చేరుకుని, ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. గంగిరెడ్డికి పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. గతంలో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో […]

Update: 2020-10-03 07:47 GMT

దిశ, ఏపీబ్యూరో : ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి పార్థివ దేహానికి సీఎం జగన్ ​నివాళులు అర్పించారు. జగన్‌కు ఆయన స్వయాన మామగారు. ​వైఎస్ భారతి తండ్రి. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. దీంతో జగన్​ ఇవాళ కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్​ ద్వారా పులివెందులకు చేరుకుని, ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

గంగిరెడ్డికి పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. గతంలో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు. ఈయన మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ సంతాపం వ్యక్తంచేశారు. వైఎస్సార్‌ జిల్లాలో ప్రజా వైద్యునిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని సీఎం కొనియాడారు.

గంగిరెడ్డి మృతికి నివాళులు అర్పించిన వారిలో వైఎస్‌ జగన్‌ దంపతులు, గవర్నర్ బిశ్వభూషన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల, టీటీడీ చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలం సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన, శ్రీకాంత్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రవీంద్రనాథ్‌ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, గౌతమ్‌రెడ్డిలు ఉన్నారు.

Tags:    

Similar News