విశాఖలో మరో సైబర్ మోసం.. ముగ్గురు కేటుగాళ్ల అరెస్ట్

విశాఖలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ...

Update: 2024-10-02 15:55 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో మరో సైబర్ మోసం(Cyber Fraud) వెలుగులోకి వచ్చింది. సైబర్ మోసాలపై పోలీసులు ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాజాగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. సైబర్ ముఠాకు బ్యాంక్ అకౌంట్ నెంబర్లను హైదరాబాద్‌కు చెందిన ఉదయ్ కిరణ్, రామిరెడ్డి, చంగల్ రాయుడు ఇస్తున్నట్లు గుర్తించారు. విశాఖ‌కు చెందిన వ్యక్తి నుంచి రూ. 16 లక్షలు కొట్టివేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. బ్యాంక్ అకౌంట్ ద్వారా ఫోన్ నెంబర్ సేకరించిన సైబర్ కేటుగాళ్లు.. విశాఖకు చెందిన వ్యక్తికి ఫోన్ చేశారు. మనీలాండరింగ్ కేసులో ఇరికిస్తామంటూ బాధితుడిని బెదిరించారు. అలా బాధితుడి నుంచి రూ. 16 లక్షలు కొట్టేశారు. దీంతో పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం కోర్టులో ప్రవేశ పెడతామని పోలీసులు తెలిపారు. 


Similar News