24 గంటల్లోపే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు

కర్నూలు పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu naidu) ఓ కుటుంబానికి ఇచ్చిన మాటను 24 గంటల్లోపే నిలబెట్టుకున్నారు.

Update: 2024-10-02 17:15 GMT

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu naidu) ఓ కుటుంబానికి ఇచ్చిన మాటను 24 గంటల్లోపే నిలబెట్టుకున్నారు. మంగళవారం కర్నూలు పర్యటనలో భాగంగా.. పుచ్చకాలయమడలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. తలారి గంగమ్మ కవిత కుటుంబాలకు సీఎం హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈ రోజు గంగమ్మ కుమారుడు అశోక్ కు సీఎం చంద్రబాబు.. ఎలక్ట్రికల్ ఆటోను పంపించారు. అలాగే కవిత భర్తకు వైద్యం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద లక్ష ఆర్థిక సాయం అందించారు. దీంతో ఇచ్చిన మాటను 24 గంటల్లోనే నిలబెట్టుకున్న నిజమైన నాయకుడు చంద్రబాబు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


Similar News