ఉద్యోగ నియామకాలపై సీఎం జగన్ కీలక ఆదేశం..

దిశ, వెబ్‌డెస్క్ : కారుణ్య నియామకాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు. కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికే కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం వైద్యరంగంపై సమీక్షనిర్వహించిన ఆయన ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 30 నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని సీఎం జగన్ స్పష్టంచేశారు. కాగా, కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో […]

Update: 2021-10-18 07:02 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కారుణ్య నియామకాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు. కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికే కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం వైద్యరంగంపై సమీక్షనిర్వహించిన ఆయన ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

వచ్చే నెల 30 నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని సీఎం జగన్ స్పష్టంచేశారు. కాగా, కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో పోలీసు, వైద్య, ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు కొందరు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News