కీర్తి సురేష్ బాలనటిగా నటించిన చిరంజీవి సినిమా ఏంటో తెలుసా..? అస్సలు ఊహించి ఉండరుగా..!

ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి నేడు స్టార్స్‌గా, సూపర్ స్టార్స్‌గా ఎంతో మంది కొనసాగుతున్నారు.

Update: 2024-08-31 09:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి నేడు స్టార్స్‌గా, సూపర్ స్టార్స్‌గా ఎంతో మంది కొనసాగుతున్నారు. వారిలో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, తరుణ్ , రాశి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్‌లో చాలా మందే ఉన్నారు. అలా బాలనటిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి నేడు పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న వారిలో కీర్తి సురేష్ ఒకరు. ఈమె తల్లి మేనక మలయాళం‌లో పెద్ద స్టార్ హీరోయిన్. తెలుగులో ఆమె మెగాస్టార్ చిరంజీవి హీరో‌గా నటించిన ‘పున్నమి నాగు’ చిత్రంలో నటించింది. తెలుగు‌లో ఈమె చేసింది తక్కువ సినిమాలే కానీ, మలయాళం లో మాత్రం ఒక స్టార్ గా చాలా కాలం కొనసాగింది. కీర్తి సురేష్ కూడా బాలనటిగా మలయాళం సినిమాల్లోనే ఎక్కువగా నటించింది. కానీ తెలుగులో కూడా ఈ అమ్మడు ఒక సినిమాలో నటించింది అనే విషయం మీకెవరికైనా తెలుసా, అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో. వివరాల్లోకి వెళితే..

ఊర మాస్ ఇమేజ్‌తో ఇండస్ట్రీ లో కొనసాగుతున్న చిరంజీవి.. ‘డాడీ’ లాంటి సాఫ్ట్ ఫ్యామిలీ డ్రామా తో 2001 వ సంవత్సరంలో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకి అప్పట్లో పాజిటివ్ రివ్యూస్ అయితే బాగానే వచ్చాయి కానీ, చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా ఆయనని అభిమానులు ఇంత సాఫ్ట్ రోల్‌లో చూసేందుకు ఇష్టపడలేదు. దీంతో కమర్షియల్‌గా ఈ చిత్రం యావరేజ్ అయ్యింది. అయితే ఈ సినిమాలో చిరంజీవి కూతురు పాత్ర కోసం అప్పట్లో చాలా ఆడిషన్స్ చేశారట. అలా చిరంజీవి దృష్టిలోకి కీర్తి సురేష్ వచ్చింది. 2000 సంవత్సరంలో కీర్తి సురేష్ బాలనటిగా మలయాళంలో ‘పైలట్స్’ అనే సినిమా చేసింది. ఇందులో ఆమె నటన చూసి ఎంతో నచ్చిన చిరంజీవి తాను చేయబోతున్న డాడీ సినిమాలో నటింపజేస్తే బాగుటుందని అనుకున్నాడట. కీర్తి సురేష్ తల్లి కూడా అందుకు ఒప్పుకుందట. అందులో భాగంగా రెండు కీలకమైన సన్నివేశాలను కూడా డైరెక్టర్ సురేష్ కృష్ణ తీసాడట.

కానీ ఎందుకో వాటి ఔట్పుట్ చూసిన తర్వాత సురేష్ కృష్ణ సంతృప్తి చెందలేదట. తాను అనుకున్నట్టుగా ఆ చిన్న పాప క్యారెక్టర్ రావడం లేదని, ఇదే విషయాన్ని చిరంజీవికి చెప్పగా, వేరే అమ్మాయిని చూద్దాం అని చెప్పి కీర్తి సురేష్‌ని తప్పించి అనుష్క మల్హోత్రా అనే అమ్మాయిని తీసుకున్నారట.. అలా కీర్తి సురేష్ బాలనటిగా చిరంజీవి సినిమాలో నటించినా కూడా వెండితెర మీద ఆయనతో కలిసి కనిపించే అదృష్టం దక్కలేదు. కానీ కీర్తి సురేష్ హీరోయిన్ అయ్యాక చిరంజీవితో ‘భోళా శంకర్’ చిత్రంలో నటించింది. ఇందులో ఆమె చిరంజీవి సోదరి గా కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే.


Similar News