శ్రీశైలం ప్రమాదంపై సీఐడీ విచారణ

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్‌సింగ్‌ను నియమించారు. ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా, శ్రీశైలం పవర్ హౌస్ ప్రమాదంలో ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను గుర్తించారు. రెస్క్యూ టీమ్ సహాయ చర్యలను ముమ్మరం చేసింది.

Update: 2020-08-21 04:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్‌సింగ్‌ను నియమించారు. ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా, శ్రీశైలం పవర్ హౌస్ ప్రమాదంలో ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను గుర్తించారు. రెస్క్యూ టీమ్ సహాయ చర్యలను ముమ్మరం చేసింది.

Tags:    

Similar News