కొల్లు రవీంద్ర చీమకు కూడా అపకారం చేయని మనిషి : బాబు

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర చీమకు కూడా అపకారం చేయని మనిషి అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. పార్టీ నేతలతో టెలీ కన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన బాబు.. మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్యకేసులో కొల్లు రవీంద్రను అరెస్టు చేయడం బాధాకరమని అన్నారు. వైఎస్సార్సీపీ అవినీతిని ప్రశ్నించాడన్న కారణంతోనే ఈ హత్యకేసులో రవీంద్రను ఇరికించారని బాబు ఆరోపించారు. రెండు కుటుంబాల మధ్య […]

Update: 2020-07-05 05:34 GMT

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర చీమకు కూడా అపకారం చేయని మనిషి అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. పార్టీ నేతలతో టెలీ కన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన బాబు.. మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్యకేసులో కొల్లు రవీంద్రను అరెస్టు చేయడం బాధాకరమని అన్నారు. వైఎస్సార్సీపీ అవినీతిని ప్రశ్నించాడన్న కారణంతోనే ఈ హత్యకేసులో రవీంద్రను ఇరికించారని బాబు ఆరోపించారు. రెండు కుటుంబాల మధ్య కక్షలు రేపింది వైఎస్సార్సీపీయేనని అన్న ఆయన, ఆధిపత్య పోరులో పరస్పరం హత్యలు చేసుకున్నారని చెప్పుకొచ్చారు.సొంత నియోజకవర్గంలో సొంత బాబాయి హత్యకు గురై 13 నెలలు గడిచినా హంతకులను పట్టుకోలేక పోయారని వైఎస్ వివేకానందరెడ్డి హత్యను గుర్తు చేశారు. జగన్ కావాలనే ప్రతీకార రాజకీయ చర్యలకు పూనుకుంటున్నాడని బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News