వైఎస్ వివేకా హత్యకేసు: సీబీఐ విచారణకు వైఎస్ సుధీర్‌రెడ్డి

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుంది. కడప సెంట్రల్ జైలు గెస్ట్‌హౌస్‌లో 94వరోజు  విచారణ జరిపింది సీబీఐ. బుధవారం సీబీఐ విచారణకు వైఎస్ వివేకా సోదరుడు వైఎస్ సుధీర్‌రెడ్డి హాజరయ్యారు. సుధీర్‌రెడ్డిని సీబీఐ విచారిస్తోంది. వివేకా హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలు.. వివేకాతో ఉన్న అనుబంధం… వివేకా ఆర్థిక లావాదేవీలు.. రాజకీయ ప్రత్యర్థులు వంటి అంశాలపై ఆరా తీస్తోంది. ఇకపోతే వైఎస్ వివేకా హత్యపై సీబీఐ వ్యూహాత్మకంగా […]

Update: 2021-09-08 04:10 GMT

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుంది. కడప సెంట్రల్ జైలు గెస్ట్‌హౌస్‌లో 94వరోజు విచారణ జరిపింది సీబీఐ. బుధవారం సీబీఐ విచారణకు వైఎస్ వివేకా సోదరుడు వైఎస్ సుధీర్‌రెడ్డి హాజరయ్యారు. సుధీర్‌రెడ్డిని సీబీఐ విచారిస్తోంది. వివేకా హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలు.. వివేకాతో ఉన్న అనుబంధం… వివేకా ఆర్థిక లావాదేవీలు.. రాజకీయ ప్రత్యర్థులు వంటి అంశాలపై ఆరా తీస్తోంది. ఇకపోతే వైఎస్ వివేకా హత్యపై సీబీఐ వ్యూహాత్మకంగా దర్యాప్తు చేస్తోంది. అనుమానితులతో పాటు వైఎస్‌ కుటుంబ సభ్యులను కూడా విచారిస్తుంది. ఇటీవలే వైఎస్ కుటుంబ సభ్యులతోపాటు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డిని విచారించిన సీబీఐ తాజాగా సుధీకర్‌ రెడ్డిని విచారిస్తోంది.

https://www.facebook.com/Dishacinema

Tags:    

Similar News