భవానీపురంలో నగదు పట్టివేత..

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని విజయవాడ జిల్లా భవానీపురంలో భారీగా నగదు పట్టుబడింది. టాస్క్‌ఫోర్సు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పీఆర్కే బిల్డింగ్ దగ్గర రూ.35లక్షలు పట్టుబడ్డాయి. ఆ నగదు విజయవాడ హోల్‌సేల్ ఐరన్ మర్చంట్ వ్యాపారులదని గుర్తించారు. హవాలా రూపంలో నగదు చేతులు మారుతోందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు విజయవాడ పోలీసులు చెబుతున్నారు.

Update: 2020-10-17 01:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని విజయవాడ జిల్లా భవానీపురంలో భారీగా నగదు పట్టుబడింది. టాస్క్‌ఫోర్సు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పీఆర్కే బిల్డింగ్ దగ్గర రూ.35లక్షలు పట్టుబడ్డాయి. ఆ నగదు విజయవాడ హోల్‌సేల్ ఐరన్ మర్చంట్ వ్యాపారులదని గుర్తించారు.

హవాలా రూపంలో నగదు చేతులు మారుతోందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు విజయవాడ పోలీసులు చెబుతున్నారు.

Tags:    

Similar News