2 నెలల్లో 35 లక్షల పెళ్లిళ్లు.. ఎన్ని లక్షల కోట్లు ఖర్చుకానున్నాయో తెలుసా..

పండుగల సీజన్ తర్వాత భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది.

Update: 2024-09-26 15:44 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : పండుగల సీజన్ తర్వాత భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది. దేశంలో వివాహాన్ని అత్యంత ఖరీదైన అకేషన్ గా పరిగణిస్తారు. తల్లిదండ్రులు లక్షల రూపాయలు వెచ్చించి ఆడంబరంగా తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. కొంతమంది అయితే తమ జీవితకాల సంపాదనను పెళ్లిళకే ఖర్చు చేస్తారు. కొందరు దీని కారణంగా అప్పుల పాలవుతారు. అలాగే కొన్ని నివేదికల ప్రకారం భారతదేశంలోని ప్రజలు విద్య కంటే వివాహానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నాయని తేలింది. ఇదిలా ఉంటే పెళ్లిళ్ల సీజన్‌ మొదలవుతుంది. కొన్ని అంచనాల ప్రకారం ఒక్క నవంబర్‌-డిసెంబర్‌ నెలలోనే 35 లక్షల పెళ్లిళ్లు జరగాల్సి ఉంది. ఈ పెళ్లిళ్లకు మొత్తం రూ.4.25 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు వేస్తున్నారు నిపుణులు.

ఒక భారతీయుడు తన పెళ్లికి తన చదువు కంటే కూడా రెట్టింపు ఖర్చు చేస్తాడని నివేదికలు చెబుతున్నాయి. కొంతమంది దృష్టిలో ఇది వృధా ఖర్చు కావచ్చు, కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ వృధా వ్యయం భారత ఆర్థిక వ్యవస్థకు మద్దతునిస్తుంది.

35 లక్షలకు పైగా వివాహాలు..

ఈ ఏడాది నవంబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్యకాలంలో భారత్‌లో 35 లక్షలకు పైగా వివాహాలు జరుగుతాయని అంచనా. ఇందులో దాదాపు రూ.4.25 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనాలు వేస్తున్నాయి కొన్ని నివేదికలు. భారతదేశంలో ప్రతి సంవత్సరం కోటి వివాహాలు జరుగుతున్నాయి. ఈ రంగం భారతదేశంలో నాలుగవ అతిపెద్ద పరిశ్రమగా మారింది. ఈ ఏడాది పెళ్లిళ్లకు 130 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతాయని, కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనాలు కూడా ఉన్నాయి.

బంగారానికి డిమాండ్..

ఒక నివేదిక ప్రకారం ప్రభుత్వం బంగారం పై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. దీంతో బంగారానికి డిమాండ్ పెరుగుతుందని అంచనా. భారతదేశంలో మతపరంగా, సామాజికంగా బంగారం చాలా ముఖ్యమైనది, విలువైనది. ప్రజలు దీన్ని పెట్టుబడిగా కూడా చూస్తారు.

రిటైల్ మార్కెట్..

బంగారానికి డిమాండ్ పెరగడం వల్ల రిటైల్ మార్కెట్‌లో కూడా పుంజుకుంటుంది. ప్రజలు వివాహాలు, పండుగలకు ఖర్చు చేసినప్పుడు, రిటైల్, ఆతిథ్యం, ​​ఆభరణాలు, ఆటోమొబైల్ రంగాలు లాభపడతాయి. ఈ రంగాలన్నీ ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి.

కంపెనీల లాభాలు..

డిమాండ్ పెరగడంతో కంపెనీల లాభాలు కూడా పెరుగుతాయి. దీంతో కంపెనీల షేర్ల ధరలు పెరుగుతాయి. ఇది మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ పై సానుకూల ప్రభావం చూపుతుంది. భారతదేశంలో ఈ పెళ్లిళ్ల సీజన్ సంతోషకరమైన సమయం మాత్రమే కాదు, ఇది ఆర్థిక వ్యవస్థకు కూడా ముఖ్యమైనది. వివాహ సమయంలో ఖర్చు, పెరుగుతున్న డిమాండ్ అన్ని రంగాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది.


Similar News