Gold Prices: పరుగులు పెడుతున్న బంగారం ధరలు

ఆభరణాల కొనుగోళ్లు ప్రపంచ మార్కెట్ల డిమాండ్‌తో ఢిల్లీలో బంగారం ధరలు రూ.400 పెరిగి 10 గ్రాములు రూ.78,000ను అధిగమించాయి

Update: 2024-09-26 16:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇటీవల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన సాధనాల్లో సొమ్ము పెట్టేందుకు సిద్ధమయ్యారు. అమెరికా డాలర్ బలహీనత, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చైనాలో వడ్డీ రేటు తగ్గింపుల మధ్య పసిడి రికార్డు గరిష్ట స్థాయికి చేరింది. ఆభరణాల వ్యాపారుల నిరంతర కొనుగోళ్లతో పాటు ప్రపంచ మార్కెట్లలో బలమైన డిమాండ్‌తో దేశ రాజధానిలో బంగారం ధరలు గురువారం రూ.400 పెరిగి 10 గ్రాముల రికార్డు స్థాయి రూ.78,000ను అధిగమించాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ. 600కి పైగా పెరిగి రూ. 77,020కి చేరింది. వివిధ రకాల పన్నులు కలుపుకుని ఇది దాదాపు రూ. 78,000 దాటొచ్చు. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి రూ. 70,600కి పెరిగింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి పశ్చిమాసియాలో వరుసగా కొనసాగుతున్న యుద్ధ భయాలతో బంగారం ధర 2024లో ఇప్పటివరకు 28 శాతం పెరిగింది. వెండి కూడా రూ. 3000 పెరిగి కిలో రూ. 1,01,000 చేరుకుంది. జీఎస్టీ లాంటి పన్నులు కలుపుకుంటే ఇది ఇంకా ఎక్కువ కావొచ్చు.  

Tags:    

Similar News