జియో కస్టమర్స్‌కు బిగ్ షాక్.. ఆ ప్లాన్స్ లేనట్లే!

జియో కస్టమర్లకు బిగ్ షాక్ తగలనుంది. ఇప్పటికే టారిఫ్‌లు పెంచిన జియో, పాపులర్ ప్లాన్స్ తొలగించి యూజర్లకు షాకులమీద షాకులిస్తోంది. ప్రస్తుతం అత్యధిక మంది వినియోగించే నెట్ వర్క్ ఏదైనా ఉన్నదా

Update: 2024-07-02 09:29 GMT

దిశ, ఫీచర్స్ : జియో కస్టమర్లకు బిగ్ షాక్ తగలనుంది. ఇప్పటికే టారిఫ్‌లు పెంచిన జియో, పాపులర్ ప్లాన్స్ తొలగించి యూజర్లకు షాకులమీద షాకులిస్తోంది. ప్రస్తుతం అత్యధిక మంది వినియోగించే నెట్ వర్క్ ఏదైనా ఉన్నదా అంటే అది జియోనే. మంచి ప్లాన్స్, ఆఫర్స్ ఉండటడంతో చాలా మంది జియో వైపే మొగ్గు చూపారు. కానీ ఈ మధ్య ఈ నెట్ వర్క్ తమ కస్టమర్స్‌ ‌ఊహించని విధంగా షాకులిస్తోంది. ఇప్పటికే రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచిన జియో మరో రెండు ప్లాన్స్‌ను మార్చేసింది. యూజర్స్ ఎక్కువగా వినియోగించే రూ.395, రూ.1,559 ప్లాన్స్‌ను తొలిగించినట్లు తెలుస్తోంది.

ఈ కొత్త టారిఫ్‌లు జులై3వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఈ ప్లాన్స్‌తో జియో కస్టమర్స్‌పైన పెను భారం పడనుంది. ఇక అదనపు ఛార్జీలను తప్పించుకునేందుకు ఒక రోజు ముందే రిఛార్జ్ చేసుకోవడానికి యూజర్స్ ప్రయత్నం చేస్తున్నారు.కానీ ఆ ప్లాన్స్ కనిపించకపోవడంతో దీనిపై కొందరు వినియోగదారులు ఎక్స్ ఖాతలో ఫిర్యాదు చేస్తున్నారు. ఇక రూ.395కే వచ్చే మూడు నెలల 6జీబీ డేటా ప్లాన్ రేపటి నుంచి 479కి అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.

Similar News