పతనమైన దేశీయ మార్కెట్లు
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కొన్ని వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. వైరస్ నియంత్రణలో భాగంగా దేశంలో చాలా రాష్ట్రాలు సోమవారం నుంచి లాక్డౌన్ ప్రకటించాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. సోమవారం ఉదయమే మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బీఎస్ఈ సెన్సెక్స్ 2718.15 పాయింట్లు పడిపోవడంతో ముదుపర్ల సొమ్ము 9 శాతం హరించుకుపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 పాయింట్లు పతనమైంది. గత వారాంతం రోజు […]
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కొన్ని వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. వైరస్ నియంత్రణలో భాగంగా దేశంలో చాలా రాష్ట్రాలు సోమవారం నుంచి లాక్డౌన్ ప్రకటించాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. సోమవారం ఉదయమే మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బీఎస్ఈ సెన్సెక్స్ 2718.15 పాయింట్లు పడిపోవడంతో ముదుపర్ల సొమ్ము 9 శాతం హరించుకుపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 పాయింట్లు పతనమైంది. గత వారాంతం రోజు 803.8 పాయింట్లు కోల్పోయింది. బ్యాంకింగ్, ఆటోమొబైల్, మెటల్ రంగాలు భారీగా పతనమయ్యాయి.