YCP కలర్స్‌లో వినాయకుడు.. సీఎంకు కుర్రాడి స్ట్రాంగ్ వార్నింగ్(వీడియో)

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినట్టు అధికారులు చెబుతున్నారు. పాజిటివ్ కేసులు కూడా తక్కువ సంఖ్యలోనే నమోదు అవుతున్నాయి. అయితే కరోనా థర్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి వేడుకలపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ తీరుపై ఓ కుర్రాడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీని పూర్తిగా క్రిస్టియన్ రాష్ట్రంగా మార్చాలని సీఎం అనుకుంటున్నారా అని ప్రశ్నించాడు. కేవలం […]

Update: 2021-09-07 00:04 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినట్టు అధికారులు చెబుతున్నారు. పాజిటివ్ కేసులు కూడా తక్కువ సంఖ్యలోనే నమోదు అవుతున్నాయి. అయితే కరోనా థర్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి వేడుకలపై నిషేధం విధించింది.

ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ తీరుపై ఓ కుర్రాడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీని పూర్తిగా క్రిస్టియన్ రాష్ట్రంగా మార్చాలని సీఎం అనుకుంటున్నారా అని ప్రశ్నించాడు. కేవలం హిందువుల పండుగలపైనే ఎందుకు వివక్ష చూపుతున్నారని అన్నాడు.

మేము కచ్చితంగా వీధికి ఒక వినాయకుడిని మండపం పెట్టి వేడుకలు నిర్వహించుకుంటామని.. కరోనా నిబంధనలను పాటిస్తూనే ఈ వేడుకలను జరుపుకుంటామని అన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో వినాయకుడి విగ్రహం వైసీపీ గుర్తులతో తయారు చేయడం గమనార్హం. 

Tags:    

Similar News