తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న ‘బ్లాక్ ఫంగస్’.. భారీగా మరణాలు

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీని ఓ వైపు కరోనా వైరస్ వణిస్తుంటే.. మరో వైపు బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ఏపీలోని గుంటూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. జీజీహెచ్‌లో బ్లాక్ ఫంగస్ లక్షణాలతో 27 మంది చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రకాశం జిల్లాలో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 25 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో బ్లాగ్ ఫంగస్ సోకి ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. ఇక.. […]

Update: 2021-05-21 21:37 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీని ఓ వైపు కరోనా వైరస్ వణిస్తుంటే.. మరో వైపు బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ఏపీలోని గుంటూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. జీజీహెచ్‌లో బ్లాక్ ఫంగస్ లక్షణాలతో 27 మంది చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రకాశం జిల్లాలో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 25 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో బ్లాగ్ ఫంగస్ సోకి ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు.

ఇక.. తెలంగాణలో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా బ్లాక్ ఫంగస్ సోకి నిజామాబాద్ జిల్లాలో మాజీ సర్పంచ్ మృత్యువాతపడ్డారు. సూర్యాపేట జిల్లాలో ఆరుగురు బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో బాధితులు చికిత్స తీసుకుంటున్నారు.

 

Tags:    

Similar News