సూర్యాపేట, జనగామలో ‘బండి’ పర్యటన.. మరికాసేపట్లో ప్రెస్‌మీట్

దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం సూర్యాపేట, జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మకూర్ (ఎస్), జాజిరెడ్డి గూడెం, తిరుమల గిరిలో పర్యటించి ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు సెంటర్లను పరిశీలించనున్నారు. అయితే, బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో స్థానిక బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. నిన్న నల్గొండ పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ లీడర్లు, స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బండి సంజయ్ పర్యటనను అడ్డుకోవడమే కాకుండా బీజేపీ నేతలపై […]

Update: 2021-11-15 22:27 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం సూర్యాపేట, జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మకూర్ (ఎస్), జాజిరెడ్డి గూడెం, తిరుమల గిరిలో పర్యటించి ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు సెంటర్లను పరిశీలించనున్నారు. అయితే, బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో స్థానిక బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు.

నిన్న నల్గొండ పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ లీడర్లు, స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బండి సంజయ్ పర్యటనను అడ్డుకోవడమే కాకుండా బీజేపీ నేతలపై రాళ్ల దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే తమపై కక్ష్య పూరిత చర్యలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పర్యటనకు ముందు ఈ రోజు ఉదయం 9.30 కు బండి సంజయ్ ప్రెస్‌మీట్ ఉంటుందని బీజేపీ నేతలు తెలిపారు.

Tags:    

Similar News