దాడులను అరికట్టడంలో ప్రభుత్వం ఫెయిల్ : ధియోధర్

దిశ, ఏపీబ్యూరో : రాష్ర్టంలో ఆలయాలపై దాడులను నియంత్రించడంలో జగన్​ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ర్ట వ్యవహారాల ఇన్​చార్జి సునీల్​ ధియోధర్​ విమర్శించారు. తిరుపతిలో ఆదివారం నిర్వహించిన పార్టీ సభలో ఆయన మాట్లాడుతూ ఇంతవరకు జరిగిన ఘటనలపై ఒక్క కేసునూ నిగ్గు దేల్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ఘటనలపై సీఎం జగన్​మౌనం దేనికి సంకేతమని ప్రశ్నించారు. దేవాదాయ మంత్రిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 50 ఆలయాలను కూల్చారు. చంద్రబాబు […]

Update: 2021-01-03 09:45 GMT

దిశ, ఏపీబ్యూరో : రాష్ర్టంలో ఆలయాలపై దాడులను నియంత్రించడంలో జగన్​ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ర్ట వ్యవహారాల ఇన్​చార్జి సునీల్​ ధియోధర్​ విమర్శించారు. తిరుపతిలో ఆదివారం నిర్వహించిన పార్టీ సభలో ఆయన మాట్లాడుతూ ఇంతవరకు జరిగిన ఘటనలపై ఒక్క కేసునూ నిగ్గు దేల్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరుస ఘటనలపై సీఎం జగన్​మౌనం దేనికి సంకేతమని ప్రశ్నించారు. దేవాదాయ మంత్రిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 50 ఆలయాలను కూల్చారు. చంద్రబాబు ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని సునీల్ ధియోధర్ ప్రకటించారు. ఈ వరుస దాడులు భారతదేశం మొత్తానికి జరిగిన అవమానంగా భావిస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News