హౌస్ నుంచి ఒకేసారి ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేషన్.. షాక్‌లో ఉన్న నెటిజన్లు.. ఎందుకంటే?

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-7 నాగార్జున ఉల్టా పుల్టా అని చెప్పినట్లుగానే ప్రస్తుతం రసవత్తంగా కొనసాగుతుంది.

Update: 2023-10-08 15:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-7 నాగార్జున ఉల్టా పుల్టా అని చెప్పినట్లుగానే ప్రస్తుతం రసవత్తంగా కొనసాగుతుంది. నాలుగు వారాల్లో నలుగురు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవ్వగా.. ఐదో వారం కూడా మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం గమనార్హం. కాగా 5వ వారం ఎలిమినేషన్‌ విచిత్రంగా జరిగింది. ముందు ఎలిమినేషన్‌తోనే షో స్టార్ట్ కావడం విశేషం. ఈ వారం నామినేషన్‌లో ఎడుగురు ఉన్నారు. వీరిలో శివాజీ, తేజ, అమర్‌దీప్‌, గౌతంకృష్ణ, ప్రియాంక, యావర్‌, శుభశ్రీ ఉన్నారు. అయితే నాగ్‌ ఎంట్రీ తోనే ఎలిమినేషన్‌తో ఈ ఎపిసోడ్‌ ప్రారంభమవుతుందని చెప్పాడు.

నామినేషన్‌లో ఉన్న ఏడుగురుని చీకటి గదిలోకి తీసుకెళ్లి భయపెట్టి మరీ ఎలిమినేట్‌ చేశారు. యావర్‌ని, తేజని, గౌతమ్‌, శుభశ్రీలను టచ్‌ చేసిన దెయ్యం.. చివరకు దెయ్యం శుభశ్రీని తీసుకెళ్లిపోయింది. ఐదో వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ అయ్యిందని అంతా షాక్‌ అయ్యారు. శుభశ్రీని ఎలిమినేట్ చేశాక, గౌతమ్‌ను సీక్రెట్ రూంలోకి పంపిస్తారు. కానీ గౌతమ్ ఎలిమినేట్ కాలేదు.

ఎలిమినేట్ అయినట్లు నాగార్జున స్టేజ్ పైకి తీసుకెళ్లి.. సీక్రెట్ రూంలో ఉండాలని చెబుతాడు. తర్వాత డిసర్వ్‌డ్ అవ్వాలని కలర్ ఒక కంటైనర్‌లో పోసి గౌతమ్‌ను, తేజను నిల్చొబెట్టి వారి ముందు కంటైనర్స్ పెడుతారు. అందులో రెడ్ కలర్ పోసి చెప్పాలి. హౌస్‌మెట్స్ గౌతమ్ కంటైనర్‌లో ఎక్కువ కలర్ పోస్తారు. దీంతో గౌతమ్ ఎలిమినేట్ అంటాడు. కానీ గౌతమ్ ఇప్పుడు సీక్రెట్ రూంలో ఉన్నట్లు హౌస్‌లో వాళ్లకు తెలియదు. హౌస్‌మెంట్స్ అందరూ గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడనే అనుకుంటున్నాడు.  

Tags:    

Similar News