Bigg Boss 8: ఆ హాగ్ నాకు కంఫర్టబుల్ గా లేదు.. వద్దన్నా వినడం లేదు.. ఏడుస్తూ అతనిపై యష్మి షాకింగ్ కామెంట్స్

ఆ హాగ్ నాకు కంఫర్టబుల్ గా లేదు.. వద్దన్నా వినడం లేదంటూ

Update: 2024-09-17 07:49 GMT

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా కొనసాగుతుంది. రెండు వారాలు అయిపోయాయి ఇక మూడో వారం కొన సాగుతుంది. ప్రతి సోమవారం బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఈ నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు విరుచుకుపడుతుంటారు. ముఖ్యంగా సోమవారం జరిగిన నామినేషన్స్ లో యష్మి, మణికంఠ మధ్య గొడవ జరిగింది. దీంతో యష్మి ఫైర్ అయి నేను బిగ్ బాస్ ఇంట్లో ఉన్నంతకాలం మణికంఠని నామినేట్ చేస్తూనే ఉంటానని షాకింగ్ కామెంట్స్ చేసింది.

అయితే ఈ రోజు ప్రోమో విడుదల చేయగా.. దీనిలో యష్మి మణికంఠపై ఫైర్ అయి ఆరోపణలు చేసింది. ప్రోమోలో.. మణికంఠ వచ్చి యష్మిని హాగ్ చేసుకొని.. అదంతా కేవలం నామినేషన్స్ వరకే మనసుకి తీసుకోకు అని చెప్తాడు. దీంతో యష్మి కూడా సరే ఇంక వదిలేయ్ అని చెబుతుంది.

అతను వెళ్ళిపోయాక.. నా వల్ల అసలు కావట్లేదు బిగ్ బాస్, నాకు చాలా కోపం వస్తుంది అంటూ ఏడ్చింది యష్మి. ఆ తర్వాత ఆమె పృథ్వి దగ్గరికి వెళ్లి.. నాకు చాలా టార్చర్ లా ఉంది. అతను వచ్చి హగ్ చేయడం, అది అసలు నాకు కంఫర్టబుల్ గా లేదు. ఇప్పటికే చాలా సార్లు చెప్పా .. అయినా వినట్లేదు. నేను ఉన్నంతకాలం మణికంఠ ని నామినేట్ చేస్తూనే ఉంటా అని చెప్పింది. దీంతో ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

Full View

Tags:    

Similar News