Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ నేను ఇంక ఆడనంటూ.. మైక్ తీసి పారేసిన శివాజీ

బిగ్ బాస్ సీజన్ 7 రచ్చ రచ్చగా సాగుతోంది

Update: 2023-10-06 04:27 GMT

దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 రచ్చ రచ్చగా సాగుతోంది. ఈ సీజన్ ఉల్టా పుల్టా అంటూ కొత్త టాస్క్ లు పెట్టి.. హౌస్ లో ఉన్న వారిని జంటలుగా మార్చాడు బిగ్ బాస్. అలాగే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కూడా ఇచ్చాడు. ప్రిన్స్ యావర్-తేజా, శుభశ్రీ-గౌతమ్, శివాజీ-ప్రశాంత్, అమర్ దీప్-సందీప్‌, శోభా శెట్టి- ప్రియాంకా జంటలుగా ఉన్నారు. వీరిలో తక్కువ స్టార్స్ సాధించిన శోభా శెట్టి- ప్రియాంకాలను కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పించాడు బిగ్ బాస్.

అయితే మిగిలిన నాలుగు జంటలకు ఓ టాస్క్ ఇచ్చాడు. ఇంటి దగ్గర నుంచి లెటర్స్ వచ్చాయని చెబుతారు. అయితే ఇక్కడ కూడా బిగ్ బాస్ బాంబ్ పేల్చాడు. జంటగా ఉన్న ఇద్దరిలో ఒకరు మాత్రమే లెటర్ చదవాలి. మిగిలిన వారు లెటరు చదవడానికి వీల్లేదంటూ.. అలాగే ఓపెన్ చేసిన వారు కెప్టెన్సీ టాస్క్ నుంచి కూడా తప్పుకోవాలంటూ కొత్త రూల్ పెట్టాడు. దాంతో శివాజీకి బాగా కోపం వచ్చింది. నేను ఈ గేమ్ ఆడను అంటూ.. మైక్ తీసి పక్కన పడేసాడు. శివాజీ ఏంటి ఇలా చేస్తున్నారేంటని హౌస్ లో ఉన్నవారంతా షాక్ అయ్యారు.

Read More..

ప్రభాస్ ‘సలార్‌’పై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్‌.. సినిమా హిట్టా.. ఫట్టా?  

Tags:    

Similar News