ప్రిన్స్ యావర్‌, గౌతమ్ కృష్ణలకు అన్యాయం.. బిగ్ బాస్ నిర్ణయంపై నెట్టింట రచ్చ

బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం పవర్ అస్త్ర టాస్క్ నడుస్తోంది.

Update: 2023-09-22 10:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం పవర్ అస్త్ర టాస్క్ నడుస్తోంది. ఇప్పటివరకు సందీప్, శివాజీ హౌస్ మేట్స్ కాగా.. ఈ వారం అమర్ దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి పోటీకి సిద్ధం అయ్యారు. అయితే.. అమర్‌ దీప్‌కు జుట్టు కట్ చేయించుకోవాలని బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడంతో.. అతడికి పోటీగా ప్రియాంక జుట్టు కత్తిరించుకుని పవర్ అస్త్ర రేసులో అర్హురాలుగా నిలిచింది. ఇక నిన్న శోభా శెట్టికి స్పైసీ చికెన్ తినాలని కంటెండర్ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. దాదాపు గంట వ్యవధిలో శోభా 27 చికెన్ పీసులు తింటుంది. శోభా స్థానం కోసం గౌతమ, శుభశ్రీ, పల్లవి ప్రశాంత్ పోటీపడగా.. వారికి చికెన్ పీసులు తినేందుకు టైం లిమిట్ పెడతాడు. నిమిషాల వ్యవధిలో గౌతమ్ 28 పీసులు తింటాడు. సంచాలక్‌గా ఉన్న సందీప్ పూర్తిగా తినలేదని ఓ పీస్ కౌంట్ చేయలేదు. అయినప్పటికీ విన్నర్‌గా గౌతమ్‌నే ప్రకటిస్తాడు.

కానీ బిగ్ బాస్ మాత్రం శోభాని గౌతమ్ అధిగమించలేదు కాబట్టి శోభా శెట్టి కంటెండర్ రేసులో ఉంటుందని చెప్పాడు. ఈ క్రమంలోనే ఈవారం పవర్ అస్త్ర గురించి పోటీ పడే లిస్ట్‌లో ప్రిన్స్, ప్రియాంక, శోభా నిలుస్తారు. అయితే.. వీరి ముగ్గురిలో ఎవరు వీక్ కంటెస్టెంట్ అని మెజారిటీ సభ్యులు భావిస్తారో వారు ఈ రేసులో నుంచి తప్పుకోవాలి అంటూ బిగ్ బాస్ ఆదేశిస్తారు. దీంతో శోభా ఇంకా ప్రియాంక మేము ఇద్దరం అమ్మాయిలం పోటీ పడతాం.. నువ్వు మా కంటే స్ట్రాంగ్ అంటూ యావర్‌ను రేస్‌లో నుంచి తొలగిస్తారు. ఆ మాటతో హౌస్‌లో మరోసారి రచ్చ మొదలవుతుంది. ఇలా ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ విషయంలో బిగ్ బాస్ కరెక్ట్ కాదు అంటూ నెట్టింట నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News