Bigg Boss 7 Telugu : నా రెండో పెళ్లాన్ని కూడా వదిలేసి వచ్చా అంటూ.. షాకింగ్ నిజాలు చెప్పిన హీరో శివాజీ

నా రెండో పెళ్లాన్ని కూడా వదిలేసి వచ్చా

Update: 2023-10-07 03:45 GMT

దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ నిర్వహించాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో కెప్టెన్సీ చివరి కంటెండర్ టాస్క్ చిటీ ఆయిరే పోటీలో నాలుగు జంటలు పాల్గొన్నాయి. గురువారం ఎపిసోడ్‌లో శుభ లెటర్ త్యాగం చేసి గౌతమ్‌కి, యావర్ త్యాగం చేసి తేజకు ఇచ్చారు. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో ఆట సందీప్-అమర్, శివాజీ-ప్రశాంత్ పెయిర్స్ పాల్గొన్నాయి.

ఇక శివాజీ, ప్రశాంత్ యాక్టివిటీ రూమ్ లోకి  వెళ్లారు. అక్కడ శివాజీ కోసం కాఫీతోపాటు భార్య పంపిన లెటర్ కూడా ఉంటుంది. శివాజీకి ఆ కాఫీ చూడగానే ఎక్కడా లేని ఎనర్జీ వచ్చేస్తుంది . థ్యాంక్స్ బిగ్ బాస్ కాఫీ ఇచ్చినందుకు అని చెప్పి.. వెంటనే ఒక సిప్ వేశాడు.ఆ తర్వాత శివాజీ ఈ  ఎమోషనల్ డ్రామాలేం వద్దురా.. నీకు కెప్టెన్సీ ఇచ్చేద్దామని అనుకున్నా. చివర్లో మనకు పడితే నీకే ఇచ్చేద్దామనుకున్నా. కామన్ మ్యాన్ గా  ఇక్కడి వరకు వచ్చావు. నువ్వు గెలవాల్సిందే.. నాకు కాఫీ ఇచ్చాడుగా చాలు. కంటెండర్ నాకొద్దు.. నువ్వు కంటెండర్ అవ్వు అని శివాజీ అన్నాడు.

నా పెళ్లాన్ని, కొడుకుని వదిలేసి వచ్చా. ముఖ్యంగా కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ కాఫీ నా రెండో పెళ్లాం. దాన్ని కూడా వదిలేసి వచ్చా.. లెటర్‌లో ఏముంటదో నాకు తెలుసు అని తన భార్యాపిల్లల తెలిపాడు శివాజీ. తర్వాత తనకు వచ్చిన లెటర్‌ను క్రష్ చేశాడు శివాజీ. ప్రశాంత్‌ను తన లెటర్ చదువుకోమ్మన్నాడు. ఎలాంటి పిచ్చి పనులు చేయొద్దు. నా మీద ఒట్టే అని శివాజీ చెప్పాడు. తర్వాత ప్రశాంత్ తనకు వచ్చిన లెటర్ చదివి చాలా ఎమోషనల్ అయ్యాడు.

Tags:    

Similar News