పక్కా ప్లాన్ ప్రకారమే శివాజీ పవర్ అస్త్ర తీసుకున్న Bigg Boss..!

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఐదో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ మధ్య హోరా హోరీ యుద్ధం నడుస్తోంది.

Update: 2023-10-03 08:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఐదో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ మధ్య హోరా హోరీ యుద్ధం నడుస్తోంది. ఇక ఇప్పటి వరకు కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా.. ప్రస్తుతం హౌస్‌లో 10మంది ఉన్నారు. అయితే.. సందీప్, శోభ శెట్టి, శివాజీ, ఇంకా తాజాగా పల్లవి ప్రశాంత్ పవర్ అస్త్ర గెలుచుకుని హౌస్ మేట్స్ అయిన సంగతి తెలిసిందే. కానీ, అనుహ్యంగా శివాజీ గెలుచుకున్న పవన్ అస్త్రను కోల్పోయాడు. దానికి బలమైన కారణం లేకపోలేదు. హౌస్‌లో ఉన్న మెజారిటీ కంటెస్టెంట్స్ శివాజీ హౌస్ మేట్‌గా అనర్హులు అని చెప్పడంతోనే ఆయన తన పవర్ అస్త్రను కోల్పోయాడు.

అయితే.. చిన్న లాజిక్ మిస్ అయ్యాడు బిగ్ బాస్. లాస్ట్ వీక్ సందీప్‌ని కూడా సంచాలక్‌గా అనర్హులు అని చెప్పినప్పుడు బ్యాటరీ డౌన్ చేశారు. అదే విధంగా శివాజీ బ్యాటరీ కూడా డౌన్ చేసే అవకాశం ఉంది. కానీ మొత్తానికి పవర్ అస్త్ర తీసేసుకున్నారు. ఇక్కడ ఏం అర్థం అవుతుందంటే.. పక్కా ప్లాన్ ప్రకారమే బిగ్ బాస్ శివాజీ పవర్ అస్త్ర తీసేసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యేటప్పుడు శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, ఇంకా అమర్ దీప్‌ల మధ్య మాటల యుద్ధం మంచి రసవత్తరంగా సాగుతోంది. మరి పవర్ అస్త్ర సొంతం చేసుకున్న శివాజీ, పల్లవి ప్రశాంత్ ఇద్దరు నామినేషన్స్‌లో ఉండరు కాబట్టి వేడి తగ్గుతుందని ఆలోచించిన బిగ్ బాస్.. పక్కా ప్లాన్ ప్రకారమే శివాజీ పవర్ అస్త్ర తీసేసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే శివాజీ నామినేషన్స్‌లో ఉంటే హీట్ పెరుగుతుందని ఇలా చేసినట్లు టాక్.

Read More about Bigg Boss Telugu season 7

Tags:    

Similar News