Bigg Boss Telugu 8: అతను ఐదేళ్లు లవ్ చేసి వదిలేసి వెళ్ళిపోయాడంటూ.. ఏడ్చేసిన బిగ్ బాస్ సీత?

. ఈమెను ప్రేమించి మోసం చేసిన వ్యక్తి ఎవరా అంటూ.. నెటిజెన్స్ ఆరాలు

Update: 2024-09-14 02:48 GMT

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా కొనసాగుతుంది. కానీ, ఈ సారి హౌస్ మేట్స్ ఎంపిక సరిగా లేదని ఎన్నో విమర్శలు వస్తూనే ఉన్నాయి. సోలో ఎంట్రీ లేదని జంటలుగా 14 మందిని బిగ్ బాస్ ఇంట్లోకి పంపించారు. ఇక ఆ తర్వాత సీన్ తెలిసిందే కదా.. వారి మధ్య గొడవలు పెట్టి నామినేషన్స్ రోజు ఒకరికొకరు తిట్టుకుంటూనే ఉంటారు.. బిగ్ బాస్ రూల్స్ అంటారు.. కానీ, ఒక్కరు కూడా పాటించరంటూ నెటిజెన్స్ ఈ షో మీద మండిపడుతున్నారు.

బిగ్ బాస్ లో టాస్కులు, గొడవలతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా మొదలయ్యాయి. వాళ్ళ జీవితంలో పడిన కష్టాలు, కుటుంబ సభ్యులను గుర్తు చేస్తూ.. కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయి వాళ్ళని ఏడ్చేలా చేస్తాడు బిగ్ బాస్. ఇక నిన్న రాత్రి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి సంబంధించిన కొన్ని బహుమతులు ఇచ్చి వాళ్ళని ఎమోషనల్ అయ్యేలా చేసాడు.

ఈ నేపథ్యంలోనే నటి కిరాక్ సీత కోసం ఓ బొమ్మని ఇచ్చి ఆమె షాక్ అయ్యేలా చేసాడు బిగ్ బాస్. దాన్ని చూసిన సీత ఏడవడం మొదలు పెట్టింది.. సీత మాట్లాడుతూ.. 5 ఏళ్ళ పాటు ఒక మనిషిని లవ్ చేశాను.. కానీ, నన్నుమోసం చేసి వెళ్ళిపోయాడు. అతను నా జీవితం నుంచి వెళ్ళిపోయాక నాకు ఒక మంచి స్నేహితుడు దొరికాడు. అతనే ఈ బొమ్మని నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు.. ఇది నా పక్కన లేకుండా అసలు నిద్రపోలేను అంటూ ఎమోషనల్ అయి మిస్ యు కుమార్ అంటూ ఏడ్చేసింది సీత. ఈమెను ప్రేమించి మోసం చేసిన వ్యక్తి ఎవరా  అంటూ నెటిజెన్స్ ఆరాలు తీయడం మొదలు పెట్టారు.  

Tags:    

Similar News