ప్రతిష్టాత్మాకంగా ఇళ్ల పట్టాల పంపిణీ..

దిశ, విశాఖపట్నం : ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరులో గురువారం జరిగిన ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం పేదల పక్షపాతి అని, టీడీపీ ఎన్ని కేసులు పెట్టినా పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నామన్నారు. రైతులకు మేలు చేసే చట్టాలను కూడా చేస్తున్నామన్నారు. ప్రజలు దీనిని గమనిస్తున్నారన్నారు. త్వరలోనే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన […]

Update: 2020-12-31 06:35 GMT

దిశ, విశాఖపట్నం : ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరులో గురువారం జరిగిన ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు.

ప్రభుత్వం పేదల పక్షపాతి అని, టీడీపీ ఎన్ని కేసులు పెట్టినా పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నామన్నారు. రైతులకు మేలు చేసే చట్టాలను కూడా చేస్తున్నామన్నారు. ప్రజలు దీనిని గమనిస్తున్నారన్నారు. త్వరలోనే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన అన్నిపెండింగ్‌ పనులను పూర్తిస్ధాయిలో పరిష్కరిస్తామన్నారు.

Tags:    

Similar News