వైసీపీకి భారీ షాక్.. బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరిన మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.

Update: 2024-08-15 17:24 GMT

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజతో పాటు, మరో తొమ్మిది మంది కౌన్సిలర్లు హిందూపురం ఎంఎల్ఏ బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. గత స్థానిక ఎన్నికల్లో హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో 38 వార్డుల్లో 30 వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్లు గెలిచారు. అయితే మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ మాట్లాడుతూ.. ఆ పార్టీ విధానాలు నచ్చక టీడీపీలో చేరుతున్నట్టు తెలిపారు. మిగతా కౌన్సిలర్లు కూడా త్వరలోనే టీడీపీలో చేరుతారని ఇంద్రజ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీడీపీకి మెజార్టీ సభ్యుల బలం చేకూరింది.    


Similar News