AP News:ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..?

పోరుమామిళ్ల ప్రధాన రహదారిలో ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందిస్తున్నారని అంబేద్కర్ జనసేన రాష్ట్ర కార్యదర్శి ముత్యాల ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2024-08-31 10:05 GMT

దిశ, బద్వేల్:పోరుమామిళ్ల ప్రధాన రహదారిలో ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందిస్తున్నారని అంబేద్కర్ జనసేన రాష్ట్ర కార్యదర్శి ముత్యాల ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రహదారి నిర్మాణానికి కోట్లాది రూపాయలు మంజూరు చేసింది. వైఎస్ఆర్ పార్టీ కాంట్రాక్టర్ సగం పని చేసి వదిలి వేశారని ఆయన అన్నారు. స్టేట్ బ్యాంక్,కమ్మవారి పల్లి రహదారి, గాంధీ బొమ్మ వద్ద రోడ్డు అధ్వానంగా ఉందని ఆయన అన్నారు. వర్షం పడితే రహదారిలో నడవడం కష్టం గా ఉందన్నారు. ఈ ఘటనపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.


Similar News