తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) తరలి వస్తుంటారు.

Update: 2025-04-05 02:13 GMT
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) తరలి వస్తుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించిపోతాయి అని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు.. తిరుమల చేరుకొని భక్తి శ్రద్దలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో తిరుమలలో భక్తుల రద్దీ కొన్నిసార్లు అధికంగానూ.. మరికొన్ని సార్లు సాధారణంగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో నేడు(శనివారం) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో వైకుంఠ కాంప్లెక్స్‌లోని 15 కంపార్టుమెంట్‌లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచివున్నారు. ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 12 గంటల సమయం పడుతుంది. నిన్న(శుక్రవారం) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 66,327 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,354 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.73 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News