జగనన్నతో రాష్ట్రం సుభిక్షం: ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

విద్య, వైద్యం అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన నిలిచి, సుభిక్షంగా ఉందని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు చెప్పారు. ..

Update: 2023-11-20 16:05 GMT

దిశ, కుక్కునూరు: విద్య, వైద్యం అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన నిలిచి, సుభిక్షంగా ఉందని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు చెప్పారు. సోమవారం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం తొండిపాక సచివాలయంలో ‘పల్లెకు పోదాం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తొండిపాక సచివాలయం పరిధిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు రూ. 18 కోట్ల లబ్ధి చేకూరిందని వివరించారు. జగన్ సీఎం అయ్యాక 4 లక్షలకుపైగానే ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు కుంజా నాగేశ్వరరావు, వైసీసీ మండల కన్వీనర్ కుచ్చర్లపాటి నర్సింహరాజు, గంగుల రమణారెడ్డి, వైస్ యంపీపీ గాడిద రామచంద్రం, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు

Tags:    

Similar News