కాల్‌మనీ ఆగడాలు... ఊరు వదిలి వెళ్లిపోతున్న మహిళలు

ఏలూరులో కాల్‌మనీ వేధింపులు పెచ్చుమీరాయి..

Update: 2024-09-29 12:08 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు(Eluru)లో కాల్ మనీ వేధింపులు పెచ్చుమీరాయి. కరోనా సమయంలో తీసుకున్న అప్పునకు ఇప్పటికీ వడ్డీలు కట్టించుకుంటూనే ఉన్నారు. రూ. 25 వేలు, 30 వేలు, 40 వేలు తీసుకున్న వారి నుంచి రూ. 5 లక్షలకు పైగా వడ్డీ వసూలు చేశారు. అయినా ఇంకా కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. కట్టకపోతే ఒప్పుకోమంటూ భయపెడుతున్నారు. ఇంటి వద్దకు వెళ్లి పరువు తీస్తున్నారు. అసభ్యకరంగా పవర్తిస్తున్నారు. దీంతో బాధితులు ఊళ్లు వదిలివెళ్లిపోతున్నారు. కాల్‌మనీ కేటుగాళ్ల వేధింపులు భరించలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 మంది బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Tags:    

Similar News