విశాఖలో నలుగురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్

విశాఖలో నలుగురు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు...

Update: 2024-10-18 17:10 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో నలుగురు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులే టార్గెట్ మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగుల ఐడీ కార్డులతో కార్పొరేట్, కరెంట్ ఖాతాలు తీసి మోసాలకు పాల్పడుతునారు. పక్కా సమాచారంతో వెంకట శివసాయి కృష్ణ, యాదేశ్ కుమార్, ప్రదీప్ కుమార్, సాయిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 17 రాష్ట్రాల్లో 50 సైబర్ నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. నలుగురు నిందితులను కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో నిందితులకు ధర్మాసనం రిమాండ్ విధించారు. ఈ మేరకు శివసాయి కృష్ణ, యాదేశ్ కుమార్, ప్రదీప్ కుమార్, సాయిబాబును జైలుకు తరలించారు.


Similar News