కార్యాచరణ మార్చుకుంటాం..నిలదీస్తాం: ఎమ్మెల్సీ బొత్స సంచలన వ్యాఖ్యలు

సూపర్ సిక్స్ హామీలను ఎప్పుడు అమలు చేస్తారంటూ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు..

Update: 2024-10-19 13:08 GMT

దిశ, వెబ్ డెస్క్: సూపర్ సిక్స్ హామీలను ఎప్పుడు అమలు చేస్తారంటూ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Minister Bosta Satyanarayana) ప్రశ్నించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామనుకున్నామని, ఢిల్లీ వెళ్లివచ్చిన తర్వాత జమిలీ ఎన్నికల(Jamili election)పై చంద్రబాబు మాట్లాడుతున్నారని, రెండున్నరేళ్లలోనే ఎన్నికలు వస్తాయంటే తమ కార్యచరణను కూడా మార్చుకుంటామని చెప్పారు. ఇక నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీపై నిలదీస్తామని బొత్స స్పష్టం చేశారు. 


Similar News