శ్రీవారి లడ్డూ కల్తీ పాపం ఊరికే పోదు.. జగన్‌పై వినుకొండ ఎమ్మెల్యే ఫైర్

శ్రీవారి లడ్డూ కల్తీ పాపం ఊరికే పోదని మాజీ సీఎం జగన్‌పై వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఫైర్ అయ్యారు....

Update: 2024-09-28 06:34 GMT

దిశ, వెబ్ డెస్క్: శ్రీవారి లడ్డూ కల్తీ(Srivari Laddu Adulteration) పాపం ఊరికే పోదని మాజీ సీఎం జగన్‌ (Former CM Jagan)పై వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు (Vinukonda Mla GV Anjaneyulu) ఫైర్ అయ్యారు. జగన్ తిరుమల పర్యటన రద్దు, సీఎం చంద్రబాబు(Cm Chandrababu)పై చేసిన వ్యాఖ్యాలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తిరుమల సంప్రదాయాలు ప్రతిఒక్కరూ పాటిల్సిందేనని చెప్పారు. భక్తుల మనోభావాలను జగన్ దెబ్బతీశారని, ఆ దేవుడే శిక్షిస్తారని వ్యాఖ్యానించారు. తప్పులు మీద తప్పులు చేస్తున్న జగన్‌కు శిక్ష తప్పదని హెచ్చరించారు. డిక్లరేషన్ ఇవ్వమంటే జగన్ ఎందుకు రోషమొచ్చిందని ప్రశ్నించారు. శ్రీవారి ముందు నిలబడే ధైర్యం లేకనే జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారని జీవీ ఆంజనేయులు విమర్శించారు. 


Similar News