Breaking: నెల్లూరు ఇంచార్జిగా విజయసాయిరెడ్డి.. మరో లిస్ట్ రిలీజ్

వైసీపీ ఇంచార్జుల మరో జాబితాను ఆ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. ...

Update: 2024-03-01 15:43 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఇంచార్జుల మరో జాబితాను ఆ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. ఒక పార్లమెంట్, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ ఇంచార్జులను ప్రకటించారు. నెల్లూరు పార్లమెంట్ ఇంచార్జిగా విజయసాయిరెడ్డి ఖరారు అయ్యారు. కర్నూలు అసెంబ్లీ ఇంచార్జిగా మాజీ ఐఏఎస్ ఇంతియాజ్, మంగళగిరి అసెంబ్లీ ఇంచార్జిగా మురుగుడు లావణ్యను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇప్పటికే 8 జాబితాను విడుదల చేసిన అధిష్టానం తాజాగా 9వ విడత లిస్టును విడుదల చేసింది. కాగా వచ్చే ఎన్నికలపై వైసీపీ అధినేత జగన్ దూకుడు పెంచారు. 175 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాలకు ఇంచార్జులను మార్చారు. ఈ మేరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం పక్కన పెట్టేశారు. ఇంకా పలు నియోజకవర్గాలను ఇంచార్జులను పరిశీలిస్తున్నారు. వీరిని త్వరలోనే ప్రకటించనున్నారు. 



Tags:    

Similar News