సీఎం చంద్రబాబుతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమావేశం..కారణం ఏంటంటే?

నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) నాయుడుతో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు.

Update: 2024-09-12 08:29 GMT

దిశ,వెబ్‌డెస్క్:నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) నాయుడుతో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. అయితే ఈ రోజు విజయవాడకు (Vijayawada) మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ రోజు సాయంత్రం 3 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి ఉత్తమ్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే..సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ (Telangana) నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమావేశం పై కీలక చర్చలు జరుగుతున్నాయి. కానీ వాస్తవానికి మంత్రి ఉత్తమ్ తన చిన్ననాటి మిత్రుడిని (Childhood Friend) పరామర్శించేందుకు విజయవాడ (Vijayawada) కు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమావేశం కానున్నారు. ఏది ఏమైనా వీరి సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత సంతరించుకుంటోంది.


Similar News