చెరువులో పడి భార్యాభర్తలు మృతి

ఏలూరు జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

Update: 2024-10-26 15:03 GMT

దిశ ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి ఇద్దరు భార్యాభర్తలు మృతి చెందారు. గ్రామస్తులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోతిరెడ్డిపల్లికి చెందిన కొండా రాంబాబు చెరువులోకి స్నానానికి దిగిన గేదెలను తీసుకు వచ్చేందుకు వెళ్ళి నీటి ఊబిలో కూరుకుపోయాడు. కేకలు పెడుతున్న భర్తను రక్షించేందుకు చెరువు నీటిలోకి దూకిన భార్య ప్రశాంతి సహా ఇద్దరూ ప్రాణాలు విడిచారు. మృతులు కొండా రాంబాబు, ప్రశాంతిలుగా గుర్తించారు. భార్యాభర్తల మృతి ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నూజివీడు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News