రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి.. మరో విద్యార్థికి గాయాలు

కారు సడన్ బ్రేక్ వేయడం వల్ల వెనుక నుంచి వస్తున్న బైక్ అదుపుతప్పి కారును ఢీ కొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న విద్యార్థి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

Update: 2024-10-26 16:39 GMT

దిశ, శంకరపల్లి: కారు సడన్ బ్రేక్ వేయడం వల్ల వెనుక నుంచి వస్తున్న బైక్ అదుపుతప్పి కారును ఢీ కొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న విద్యార్థి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్, ఎర్వ గుడా గ్రామాల మధ్య శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గా నవాబ్ పేట మండలం శేరిగూడ గ్రామానికి చెందిన భరత్ కుమార్ (15)చరణ్ కుమార్ లు శంకరపల్లి లోని వివేకానంద పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నారు. శనివారం సాయంత్రం ప్రత్యేక తరగతులు ఉండడంతో ప్రత్యేక తరగతుల అనంతరం బైక్ పై వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్ర గాయాలైన భరత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా గాయాలైన చరణ్ కుమార్ చికిత్స నిమిత్తం నగరంలోని కాంటినెంట్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శంకరపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. భరత్ కుమార్ మృతి చెందడం పట్ల సంఘటనా స్థలంలో తల్లిదండ్రులు బోరున విలపించారు. 


Similar News