AP News:భార్యాభర్తల మృతి పై స్పందించిన మంత్రి పార్థసారథి

నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొండా రామారావు, ప్రశాంతి దంపతులు శనివారం చెరువులోకి దిగిన పశువుల కోసం.. చెరువులో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందారు.

Update: 2024-10-26 15:21 GMT

దిశ,నూజివీడు: నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొండా రామారావు, ప్రశాంతి దంపతులు శనివారం చెరువులోకి దిగిన పశువుల కోసం.. చెరువులో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. విషయం తెలిసిన వెంటనే తమ వ్యక్తిగత సిబ్బందిని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీస్ సిబ్బందిని పార్టీ నాయకులను సంఘటన స్థలానికి వెళ్ళి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

తన కార్యాలయం ప్రత్యేక అధికారి ప్రకాశరావుతో పాటు టీడీపీ నాయుకులు, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రొంగడి.కృష్ణ తదితరులను వెంటనే సంఘటన స్థలానికి పంపించి మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన వారికి ప్రభుత్వం నుంచి అందే సహాయం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.


Similar News