మహేందర్ మృతి కేసులో ట్విస్ట్: రాజకీయం చేయెుద్దన్న కుటుంబ సభ్యులు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో దళిత యువకుడు మహేందర్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.

Update: 2023-11-19 07:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో దళిత యువకుడు మహేందర్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మహేందర్ మృతిపై రాజకీయం చేయెుద్దు అంటూ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మహేందర్ చిన్నమ్మ కొవ్వూరు జెడ్పీటీసీ బొంత వెంకట లక్ష్మి ఓ వీడియో విడుదల చేశారు. మహేందర్ మృతి బాధాకరమని అన్నారు. అయితే ఇలాంటి విషాద సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమకు అండగా నిలిచారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం దళిత పక్షపాత ప్రభుత్వం నిరూపించారని అన్నారు. మహేందర్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ మంత్రులను, పార్టీ నాయకులను తమ ఇంటికి పంపించారని చెప్పుకొచ్చారు. అంతేకాదు రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా సైతం అందజేశారని తెలిపారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం, ఇల్లు కట్టిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని వీడియోలో తెలియజేశారు. అయితే మహేందర్ మృతికి కారణమైన నేరస్థులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని.. కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారని వెల్లడించారు. ఈ విషాద సమయంలో తమకు అండగా నిలిచిన సీఎం వైఎస్ జగన్, మంత్రులు, నాయకులకు,అలాగే గ్రామ యువతకు జెడ్పీటీసీ వెంకట లక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో మహేందర్ మృతిని ఎవరు రాజకీయం చేయవద్దు అని జెడ్పీటీసీ బొంత వెంకట లక్ష్మి విజ్ఞప్తి చేశారు. 

Tags:    

Similar News