గరుడసేవకు అంతా సిద్ధం.. భక్తులకు ఈఓ కీలక విజ్ఞప్తి

రేపు గరుడసేవ నిర్వహించనున్న నేపథ్యంలో భక్తులకు టీటీడీ ఈఓ శ్యామలరావు కీలక విజ్ఞప్తి చేశారు.

Update: 2024-10-07 09:31 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజున మలయప్పస్వామి వారు మోహినీ అవతారంలో గరుడ వాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ.. భక్తులకు దర్శనమిస్తారు. ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాదిమంది భక్తులు తిరుమలకు వస్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈఓ శ్యామలారావు తెలిపారు. సుమారు 3.5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశామన్నారు. భక్తులకోసం ప్రధాన, ముఖ్యమైన కూడళ్లలోనూ అన్నప్రసాదాన్ని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గరుడవాహన సేవకు భక్తుల తాకిడి అధికంగా ఉండనున్న నేపథ్యంలో కొండపైకి అధికవాహనాలను అనుమతించడం లేదని, భక్తులు సహకరించాలని శ్యామలరావు విజ్ఞప్తి చేశారు. రేపు ఒక్కరోజే కొండమీది నుంచి కిందికి, కింది నుంచి కొండమీదికి ఏపీఎస్ ఆర్టీసీ 400కు పైగా బస్సులతో 3 వేల ట్రిప్పులను నడిపేందుకు ఏర్పాట్లు చేసిందని వివరించారు. కాగా.. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. 


Similar News