Nara Lokesh: గాంధీ జయంతి సందర్భంగా ‘జాతిపిత’కు మంత్రి లోకేష్ ఘన నివాళి

ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు గాంధీ జయంతి సందర్భంగా జాతిపితకు ఘన నివాళి అర్పించారు.

Update: 2024-10-02 10:55 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు గాంధీ జయంతి సందర్భంగా జాతిపితకు ఘన నివాళి అర్పించారు. ఈ క్రమంలో సత్యం, అహింస ఆయుధాలుగా భారత దేశపు స్వేచ్ఛా స్వాతంత్య్ర సమరాన్ని ముందుండి నడిపిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఘనంగా నివాళులర్పించారు. స్వరాజ్యం సాధించిన బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేయడమే మన కర్తవ్యం కావాలన్నారు. సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి అంటూ మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

Tags:    

Similar News