వైసీపీ వర్సెస్ టీడీపీ.. తిరువూరు మున్సిపల్ సమావేశం రచ్చ.. రచ్చ

కృష్ణా జిల్లా తిరువూరు మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది....

Update: 2024-06-29 13:10 GMT

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా తిరువూరు మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. తిరువూరులో నెలకొన్న సమస్యలపై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే కొలికిపూడిని సమావేశానికి పిలవకపోవడంపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను ఎందుకు ఆహ్వానించలేదని అధికారులను టీడీపీ సభ్యులు నిలదీశారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో ఇరు పార్టీ సభ్యుల అరుపులు, కేకలతో సమావేశం దద్దరిల్లింది.

ఇదిలా ఉంటే తిరువూరులోని సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది సభ్యులు చైర్ పర్సన్ నిలదీశారు. దీంతో చైర్ పర్సన్‌కు మద్దతుగా మిగిలిన సభ్యులు నిలిచారు. ఈ క్రమంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో మనస్థాపం చెందిన ఇద్దరు వైసీపీ మహిళా సభ్యులు పద్మ, నీలిమ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. కొద్దిసేపటికి సభలో పలు అంశాలపై చర్చించారు. అయితే కొన్ని అంశాలపై టీడీపీ సభ్యులు అభ్యంతరాలు తెలిపారు. 

Similar News