‘అలుసుగా చూస్తే అంతుచూస్తా’.. కార్యకర్తలకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..!

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తొలిసారి ఇవాళ సొంత నియోజకవర్గం పిఠాపురంలో

Update: 2024-07-01 14:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తొలిసారి ఇవాళ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలులో జనసేన కృతజ్ఞత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, మహిళలు, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గెలిచిన అనంతరం ఫస్ట్ టైమ్ నియోజకవర్గానికి వెళ్లడంతో కార్యకర్తలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే పవన్ ప్రసంగిస్తుండగా కొందరు కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేస్తూ పవన్ కల్యాణ్ స్పీచ్‌కు అడ్డు తగిలారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన జనసేనాని.. కార్యాకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రేమగా మాట్లాడుతుంటే అలుసుగా తీసుకోవద్దని.. అలుసుగా చూస్తే అంతుచూస్తానని కార్యకర్తలకు జనసేనాని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కాగా, కార్యకర్తలకు పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇవ్వడం జనసేనలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Similar News