Tirumala Samacharam: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం

ఆపద మొక్కల వాడైన శ్రీ వేంకటేశ్వరుడి సన్నిథి తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది.

Update: 2024-06-11 04:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆపద మొక్కల వాడైన శ్రీ వేంకటేశ్వరుడి సన్నిథి తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. సోమవారం శ్రీవారిని దర్శనానికి జనం ఓ మోస్తారుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది. రేపటితో వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. మంగళవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దివ్యమంగళ దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఆదివారం స్వామి వారిని 78,064 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 33,869 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.


Similar News