Tirumala Samacharam: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల సాధారణంగా ఉంది.

Update: 2024-07-03 03:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల సాధారణంగా ఉంది. మంగళవారం శ్రీవారిని దర్శనానికి జనం ఓ మోస్తారుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 7 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతోంది. బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సోమవారం స్వామి వారిని 67,398 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 26,512 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.09 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.


Similar News