తిరుమలలో ఇన్‌స్టా రీల్స్.. దివ్వెల మాధురిపై కేసు నమోదు

దివ్వెల మాధురి(Divvela Madhuri)పై తిరుమలలో కేసు నమోదైంది. మొత్తం మూడు సెక్షన్ల కింద తిరుమల పోలీసులు(Tirumala Police) కేసు నమోదు చేసినట్లు గురువారం వెల్లడించారు.

Update: 2024-10-10 16:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: దివ్వెల మాధురి(Divvela Madhuri)పై తిరుమలలో కేసు నమోదైంది. మొత్తం మూడు సెక్షన్ల కింద తిరుమల పోలీసులు(Tirumala Police) కేసు నమోదు చేసినట్లు గురువారం వెల్లడించారు. ఇటీవల తిరుమలలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి మాధురి రీల్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ రీల్స్‌పై విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆలయం వద్ద రీల్స్ చేయడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. దువ్వాడ భార్య వాణి మీడియా ముందుకు రావడంతో వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఇటీవల తిరుమలలో సందడి చేశారు. కొండపై దువ్వాడ, మాధురి ఫొటోషూట్, రీల్స్ చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి కంప్లైంట్ చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.


Similar News