తిరుమలకు నీటి ఎద్దడి ముప్పు!

ఏపీలోని ప్రముఖ తిరుమల తిరుపతి దేవస్థానం త్వరలోనే నీటి ఎద్దడి ముప్పును ఎదుర్కోబోతుందా..?

Update: 2024-08-21 15:48 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని ప్రముఖ తిరుమల తిరుపతి దేవస్థానం త్వరలోనే నీటి ఎద్దడి ముప్పును ఎదుర్కోబోతుందా..? అవుననే అంటోంది టీటీడీ పాలక వర్గం. రానున్న 130 రోజులకు సరిపడా నీళ్ళు మాత్రమే తిరుమలలో ఉన్నాయని, భక్తులు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ పత్రికా ప్రకటనను విడుదల చేసింది టీటీడీ. ఇప్పటి వరకు కురిసిన అత్యల్ప వర్షపాతం వలన తిరుమలలోని గోగర్భం, పాప వినాశనం, ఆకాశగంగ,కుమార ధార, పసుపు ధార వంటి ఐదు ప్రధాన డ్యాముల్లో 14 వేల గ్యాలన్ల నీరు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 5 వేల గ్యాలన్ల నీరు మాత్రమే ఉన్నదని, అది కేవలం 130 రోజులకు మాత్రమే భక్తుల మరియు స్థానికుల అవసరాలకు సరిపోతాయని పేర్కొంది. అక్టోబరులో జరగనున్న బ్రహ్మోత్సవాలలో పాల్గొనే లక్షలాది భక్తులను దృష్టిలో ఉంచుకొని, నీటి వృధాను అరికట్టేందుకు ఇప్పటి నుండే చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. 


Similar News