BREAKING: ఏపీ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్

ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సెక్రటేరియట్‌లో ఈ నెల 18వ తేదీన మంత్రి మండలి

Update: 2024-06-13 15:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సెక్రటేరియట్‌లో ఈ నెల 18వ తేదీన మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ భేటీలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై మంత్రి మండలి చర్చించనున్నట్లు సమాచారం. ఇక, చంద్రబాబుతో పాటుగా ప్రమాణ స్వీకారం చేసిన 24 మంది మంత్రులకు ఇంకా శాఖల కేటాయింపు జరగలేదు. దీంతో ఇవాళ రాత్రి లేదా రేపు నూతన మంత్రులకు ఫోర్ట్ పోలియోలు కేటాయించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీ అనంతరం ఈ నెల 19 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోన్నట్లు టాక్. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కొలువుదీరిన విషయం తెలిసిందే. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాలుగో సారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 


Similar News