వైఎస్‌ను చంద్రబాబే చంపారనడం దారుణం: మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

హెలికాప్టర్ ప్రమాదం (Helicopter Accident)లో ప్రాణాలు కోల్పోయిన వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి (YS Rajasheakar Reddy)ని చంద్రబాబే (Chandrababu) చంపారనడం దారుణమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Former Minister Balineni Srinivas Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-28 07:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: హెలికాప్టర్ ప్రమాదం (Helicopter Accident)లో ప్రాణాలు కోల్పోయిన వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి (YS Rajasheakar Reddy)ని చంద్రబాబే (Chandrababu) చంపారనడం దారుణమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Former Minister Balineni Srinivas Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ కుటుంబం (YS Family)లో ఆస్తుల వ్యవహారంపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆస్తుల్లో భాగంగా షేర్ల బదిలీ జరిగితే అంత రాద్ధాతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఆస్తు విషయంలో వైఎస్ జగన్ (YS Jagan), భారతీలు, వైఎస్ విజయమ్మ (YS Vijayamma), షర్మిల (Sharmila)పై కోర్టుకు వెళ్లడం బాధగా ఉందని అన్నారు. ఆడపడుచు కన్నీళ్లు ఇంటికే అరిష్టమని బాలినేని కామెంట్ చేశారు. ఇప్పటికైనా అన్నా, చెల్లెలి మధ్య ఏకాభిప్రాయం వైఎస్ విజయమ్మ (YS Vijayamma) చొరవ తీసుకోవాలని, ఈ విషయంలో ఆవిడ తప్పా.. మరొకరు జోక్యం చేసుకోకూడదు బాలినేని శ్రీనివాస రావు సూచించారు.

అయితే, హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి (YS Rajashekar Reddy)ని చంద్రబాబే (Chandrababu) చంపారనడం దారుణమని అయన అన్నారు. వైస్ ఆస్తులతో కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. వైఎస్‌ కుటుంబాన్ని చీల్చాల్సిన అవసరం చంద్రబాబు (Chandrababu), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)కు లేదని స్పష్టం చేశారు. ఆ కుటుంబాన్ని వాళ్లే చీల్చుకుంటున్నారని ఫైర్ అయ్యారు. వైఎస్‌ కుటుంబ సమస్యను విజయమ్మే పరిష్కరిస్తారని తెలిపారు. వైఎస్‌ మరణం ఇంకా బురదజల్లడం మంచిది కాదని, విజయమ్మ సూచనల ప్రకారం.. జగన్‌ (Jagan), షర్మిల (Sharmila) నడుచుకోవాలి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.

Tags:    

Similar News