విశాఖపై వైసీపీ విజన్ ఇదే.. షర్మిల సెటైరికల్ ట్వీట్

విశాఖ రాజధాని అంశంలో వైసీపీ విజన్ పై ఏపీసీసీ చీఫ్ షర్మిల ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.

Update: 2024-03-06 07:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ రాజధాని అంశంలో వైసీపీ విజన్ పై ఏపీసీసీ చీఫ్ షర్మిల ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది? పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్. ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్‌ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్. ఇప్పుడు ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా ?’ అని షర్మిల ట్వీట్ చేశారు. 

Read More..

చంద్రబాబు గెలిస్తే Jr. NTR పరిస్థితి ఇదే.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు  

Tags:    

Similar News